గంగవరం:8 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): గర్భిణీ స్త్రీలు, బాలింతలు చక్కటి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాన్ మిల్టన్ అన్నారు. ఐసీడీఎస్ సీడీపీవో నీలవేణి ఆధ్వర్యంలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కిట్లను గర్భిణీలకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో మాతా శిశు మరణాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, దీనిలో భాగంగానే ప్రత్యేక పోషకాహారాన్ని అందిస్తుందన్నారు. ఈ కిట్స్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీడీపీవో నీల వేణి మాట్లాడుతూ ఏజెన్సీలో చాలామంది మహిళలు రక్తహీనత కారణంగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయని వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని చేపట్టిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు బేబీ పావని, గంగాదేవి, అడ్డతీగల, దేవీపట్నం, రంపచోడవరం, రాజవొమ్మంగి సీడీపీవో వరహాలు, క్రాంతి, రత్నకుమారి, మాధవి అంగన్వాడి వర్కర్స్ పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







