గంగవరం (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022: గంగవరం మండల పరిషత్ రెండవ వైస్ ఎంపీపీగా గంగాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక ఎన్నికల అధికారి సూర్యనారాయణ ఎంపిడివో జాన్ మిల్టన్ ఆధ్వర్యంలో రెండవ వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది. గంగవరం ఎంపీటీసీ గంగాదేవి వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టడంతో వేరే అభ్యర్థులు ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సూర్యనారాయణ ప్రకటించారు. అనంతరం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణారెడ్డి జెడ్పిటీసీ బేబీరత్నం, ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







