గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోటిపల్లి ఆశ కార్యకర్త చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఐటీడీఏ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వెదుళ్ళ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని లచ్చిరెడ్డి సందర్శించి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల ఆరోగ్యం కాపాడే విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రమణమ్మ, చెల్లాయమ్మ గిరిజన సంఘం జిల్లా నాయకుడు తీగల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







