గంగవరం(రెడ్ బీ న్యూస్):
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులకు అవేర్ ఫౌండేషన్ ప్రతినిధులు మాస్కులను శనివారం పంపిణీ చేశారు. మండలంలోని దొరమామిడి పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో కూలీలు మాస్కులు లేకుండా పని చేయడాన్ని గమనించిన అవేర్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ ఉదయ్ శ్రీనివాస్ తమ పౌండేషన్ తరపున 150 మంది కూలీలకు మాస్కులను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పని ప్రదేశంలో భౌతిక దూరం పాటించాలని, మాస్కులు, హ్యాండ్ కర్చీఫ్ తో ముఖానికి రక్షణ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పీకేఎస్ మాధవన్ గిరిజనులు ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నిత్యావసరాలను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కమిటీ సభ్యులు ఆదినారాయణ, ఉపాధ్యాయులు బొజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







