సామర్లకోట:10 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్):
సామర్లకోట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ కరోనా వారియర్స్
గా విశేష సేవలందిస్తూ ఇటీవల నలుగురు సిబ్బంది కరోనా
బారిన పడ్డారు. వీరందరూ హోం ఐసోలేషన్ లో చికిత్స పొంది గురువారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలలో నెగటివ్ గా నిర్ధారణ
అయ్యింది. అనంతరం వారు విధులకు హాజరు కావడంతో
ఎస్.ఐ సుమంత్ ఆధ్వర్యంలో పూలవర్షంతో స్వాగతం పలికి
శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ
సందర్భంగా కరోనాను జయించిన సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ చక్రవేణి, రాంబాబు, గోపి, శ్రీను మాట్లాడుతూ..కొవిడ్ బారిన పడిన వారు ఎటువంటి భయాందోళన చెందకుండా వైద్యుల సలహాలు పాటించాలని, వ్యాయామం
తప్పనిసరిగా చేయాలన్నారు. ఇంతటి అభిమానం ఆదరణ
కనబరిచిన ఎస్ఇ సుమంత్, తోటి సిబ్బందికి సన్మాన గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







