గంగవరం (రెడ్ బీ న్యూస్) 21 నవంబర్ 2021: గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. కృష్ణ అన్నారు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు పురస్కరించుకుని ఆదివారం స్థానిక శాఖ గ్రంథాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు నిరుద్యోగులకు అవసరమయ్యే పలు పుస్తకాలు, దినపత్రికలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయాలకు వెళ్లి తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన చేతులమీదుగా బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి సత్యవతి పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







