గంగవరం:25 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): గంగవరం నుంచి దేవీపట్నం బదిలీపై వెళ్లిన తహశీల్దార్ ఎం.వీర్రాజుకు గురువారం రెవెన్యూ సిబ్బంది పూలమాలలు, దుశ్శాలువాతో ఘనంగా సన్మానం నిర్వహించారు. గంగవరంలో అన్ని శాఖల సమన్వయంతో ప్రతి పనిని ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించి మండలాన్ని ముందుంచడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగిందని పలువురు ఆయన సేవలను కొనియాడారు. ఆయన అందించిన సేవలను గుర్తించి రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య దేవిపట్నం బదిలీ చేయడం సంతోషం కలిగించిందని ఇన్చార్జ్ తహశీల్దార్ రామకృష్ణ అన్నారు. ఆయన వద్ద డీటీగా పనిచేసి ఆయన వద్ద నుంచే తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించడం తనకెంతో సంతోషంగా ఉందని, ఆయన మాదిరిగానే వీర్రాజు స్ఫూర్తితో మండలంలో పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ జిలాని,సీడీపీవో నీలవేణి, గృహ నిర్మాణశాఖ ఏఈ నాయుడు,తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







