రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ధవళేశ్వరంలోని జలవనరుల శాఖ ఎస్ఈ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీ సాగుకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉభయ గోదావరి జిల్లాల ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు (IAB) సమావేశాన్ని ఈ నెల 29న సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడలోని వివేకానంద హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ సమావేశంలో నీటి లభ్యత, సాగు ఆయకట్టుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. అనంతరం ఆయన్ని జలవనరుల శాఖ అధికారులు సత్కరించారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







