అమరావతి:4 జనవరి 2021(రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ఈనెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని వేదవిశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు శ్రీత్రిదండి చినజీయర్ స్వామి నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసంను దాడులకు పరాకాష్ఠగా చినజీయర్ పేర్కొన్నారు. దాడులు జరిగిన ఆలయాలను సందర్శించి రక్షణ విషయంలో తీసుకోవాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యల గురించి స్థానికులతో చర్చిస్తామని తెలిపారు. ఆలయాల పట్ల శ్రద్ధ ఉన్నవారంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని స్వామి పిలుపునిచ్చినట్టు వికాస తరంగణి సంఘటన కార్యదర్శి శ్రీకార్యం భవానీప్రసాద్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







