కాకినాడ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యం కొంటామని రైతుకు ధైర్యాన్నివ్వాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సబ్కలెక్టర్లు, ఆర్డీవో, ఐటీడీఏ పీవోలు, కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వీక్షణలో సమీక్షించారు.మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్కు స్థలాలు సేకరించాలన్నారు. సీఎం సమీక్ష: సీఎం జగన్ వీక్షణ సమీక్షకు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సి.హరికిరణ్, జేసీలు సుమిత్కుమార్, కీర్తి, భార్గవ్తేజ, డీఆర్వో సత్తిబాబు, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ రవీంద్రబాబు హాజరయ్యారు. కొవిడ్, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, 90 రోజుల్లో ఇంటి పట్టా, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన, ధాన్యం కొనుగోళ్లు, శాశ్వత భవన నిర్మాణాలపై సమీక్షించారు. సీపీవో త్రినాథ్, హౌసింగ్ పీడీ సుదర్శన్ పట్నాయక్, పౌరసరఫరాల సంస్థ డీఎం లక్ష్మిరెడ్డి, డీఎస్వో ప్రసాదరావు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







