గంగవరం (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పిటీసీ సభ్యురాలు బేబీ రత్నం అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కృష్ణా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని పలు సమస్యల పరిష్కారానికై పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులను కోరారు. అలాగే వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో గల సంక్షేమ పథకాలు అమలు తీరును సభ్యులకు వివరించారు. మండలంలో పలు గ్రామాల్లో రోజూ తాగునీటి సమస్య అధికంగా ఉందని సభ్యులు నిలదీయగా జల జీవన్ మిషన్ ద్వారా త్వరలోనే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని, పనులు టెండర్ల దశలో ఉన్నాయని ఆర్.డబ్ల్యూ.ఎస్ జేఈ అబ్బాయి దొర వివరించారు. రుణాలు లేని గృహ నిర్మాణ లబ్ధిదారులకు త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని ఏఈ చలపతి తెలిపారు. పాఠశాలల్లో అమలు జరిగే జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని పాఠశాల పరిధిలోగల ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి సక్రమంగా అమలు జరిగే విధంగా సహకరించాలని ఎంఈవో మల్లేశ్వర రావు కోరారు. తొలుత సూరంపాలెం ఎంపీటీసీ పద్మావతితో మండల ప్రత్యేక అధికారి సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామతులసి, ఎంపీటీసీలు ప్రభాకర్ రావు, పద్మావతి, కనకలక్ష్మి, గంగాదేవి, పలు శాఖల అధికారులు సర్పంచులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







