పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021 : మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి పలువురు వైశ్య ప్రముఖులు శనివారం స్థానిక ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో సంతాపం తెలియచేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రోశయ్య మృతి బాధాకరమని, మంచి పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు ఆయన గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి అన్నారు. అలాగే ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. సమున్నత వ్యక్తిత్వం, విషయపరిజ్ఞానం కలిగి, విలువలు పాటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి రోశయ్య అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంతాపం తెలియచేసినవారిలో లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనుబాబు, మండవిల్లి శ్రీనివాస ముత్యాలు, కొత్త రెడ్డియ్య, గ్రంధి గోపాల్, శ్రీరామ్ ప్రకాష్, తమ్మన శ్రీనివాసరావు, కృష్ణ, బొండాడ పెరుమాళ్ళు, పలువురు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







