తిరుమల (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : తెలంగాణ గవర్నర్ తమిళ సై తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్ తిరుమలకు చేరుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా ముప్పు తప్పి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించానని... ప్రజలందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని తమిళ సై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలను తెలియ్యజేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







