గంగవరం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పౌష్టికాహారంతోనే తల్లీ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం అన్నారు. మండల కేంద్రమైన గంగవరంలోని అంగన్వాడీ కేంద్రంలో సీడీపీవో నీలవేణి ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైనా ఆమె మాట్లాడుతూ ఏడో నెల నుండి బిడ్డకు ఎటువంటి ఆహారం పెట్టాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర వివరాలను వివరించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న పాలు, బాలామృతం, గుడ్లు చిన్నారులకు తప్పనిసరిగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి, సర్పంచ్ అక్కమ్మ ఐసిడిఎస్ సూపర్వైజర్ సత్యవతి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







