సామర్లకోట: 25 జూలై 2020( రెడ్ బీ న్యూస్):
సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద కౌలు రైతులకు వ్యవసాయ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మండల వ్యవసాయ అధికారి ఐ. సత్య అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌలు హక్కు పత్రం ద్వారా సాగుదారునికి భూమిపై ఎలాంటి హక్కులు లభించవని, కేవలం పంట రుణం, పంట బీమా, సబ్సిడీ పథకాలు,ప్రభుత్వ పరంగా సంబంధిత శాఖ నుంచి అందే సౌలభ్యాలు మాత్రమే సాగు దారు పొందవచ్చన్నారు. పంట సాగు దారు కార్డు కాలపరిమితి కేవలం 11 నెలలు మాత్రమే హనంటుందన్నారు.మళ్లీ కొత్త కార్డు పొందవలసి ఉంటుంది అని తెలియచేశారు. భూయజమానులకు పూర్తిస్థాయిలో నమ్మకం కలగడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు..
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







