పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 23 అక్టోబర్ 2021: పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి పి. వెంకటరమణ ఆర్డీవో కార్యాలయం నుంచి డివిజన్ పరిధిలోని తహశీల్దార్లతో వర్చువల్ కాన్ఫరెన్స్ సమావేశం శనివారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై రెవెన్యూ పరమైన అంశాలపై ఆర్డీవో దిశా నిర్దేశం చేశారు. డివిజన్లోని వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, డిజిటల్ లైబ్రరీ తదితర శాశ్వత భవన నిర్మాణాలకు అవసరమైన భూమిని గుర్తించి నివేదికను పంపించాలని ఆదేశించారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని, మండలాల వారీగా ఉన్న కోర్టు కేసులకు కౌంటర్ ఫైల్ చేయించాలని, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను సకాలంలో పూర్తి పూర్తి చేయించాలని, పట్టాదార్ పాస్ పుస్తకాల గురించి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి పాస్ పుస్తకాలు అందించాలని, ప్రతి సోమవారం నిర్వహించే స్పందన లో వచ్చే అర్జీలను పరిష్కరించాలని, మండలంలో మున్సిపాలిటీలకు సంబంధించి హౌస్ సైట్ కు భూ విస్తీర్ణాన్ని గుర్తించి నివేదిక పంపించాలని, త్వరలో చేపట్టనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు ద్వారా అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈకేవైసీ నూరు శాతం పూర్తి చేయించాలని, గన్ని బ్యాగ్స్ సిద్ధం చేయించాలని, బియ్యం కార్డులు గురించి తదితర అంశాలకు స్పందించిన నివేదికలను ఆర్డీవో కార్యాలయానికి పది రోజులు కాల వ్యవధిలో పంపించాలని ఆర్డివో ఆదేశించారు. ఈ సమావేశంలో కార్యాలయం డీటీ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







