పాడేరు (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: శిక్షణ ఐఏఎస్ల బృందం సభ్యులు మన్యంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను పీఓ వారికి వివరించారు. ఏజెన్సీలో కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం వంటి వాణిజ్య పంటలు సాగవుతున్నట్లు చెప్పారు. ఏకీకృత పాలనా విధానంలో పీఓ అధికారాలు, విధులపై అవగాహన కల్పించారు. మన్యంలోని సహజ సిద్ధ అందాల గురించి వివరించారు. సబ్ కలెక్టర్ అభిషేక్తో పాటు 14 మంది శిక్షణ ఐఏఎస్లు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







