గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభాకర్ వర్మ కోరారు. మండలంలోని కొత్తడలో యుటిఎఫ్ మండలశాఖ మహాసభ మండల శాఖ అధ్యక్షుడు రఘుబాబు దొర అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యాశాఖలో వస్తున్న అనూహ్య పరిణామాలు పరిస్థితులను ప్రతి ఒక ఉపాధ్యాయుడు గమనించాలని భవిష్యత్తులో ఉపాధ్యాయులు మనుగడ నియామకాలు వంటివి క్లిష్టతరం అయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి సాయిరాం మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధన చేస్తూనే న్యాయబద్ధంగా రావలసిన పీ.ఆర్.సీ డీఏ కోసం పోరాటనికి సిద్ధం అవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె. కృష్ణ గౌరవ అధ్యక్షుడు రాంబాబు, యుటిఎఫ్ నాయకులు చిన్నబాబు, నాగమణి రుక్మిణి దేవి, లక్ష్మి తదితరులు ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







