కాకినాడ (రెడ్ బీ న్యూస్) 16 నవంబర్ 2021: జిల్లాలో ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు స్టేట్ ఇన్వెస్ట్మెంటు ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. కాకినాడ-విశాఖ పెట్రోకెమికల్ కారిడార్లో భాగంగా ఈ తరహా పరిశ్రమల దిశగా కసరత్తు జరుగుతోంది. మరోవైపు బిక్కవోలు మండలం బలభద్రపురం వద్ద నిర్మాణం పూర్తయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభానికి మార్గం సుగమమైంది. ఈనెలాఖరులో సీఎం చేతుల మీదుగా ఈ పరిశ్రమ ప్రారంభం అవుతుందనే ప్రచారం సాగుతోంది. సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కాలేదు. ఈ క్లోరో ఆల్కలీ ప్లాంట్లో... సోడియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్, క్లోరిన్గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ తదితర ఉత్పత్తులు తయారుకానున్నట్లు సమాచారం. ఈ పరిశ్రమ ద్వారా 500 మందికిపైగా ప్రత్యక్ష ఉపాధి లభించే వీలుంది. 2014లో కేపీఆర్ ఫెర్టిలైజర్స్ ఈ పరిశ్రమ నిర్మాణం ప్రారంభించగా.. అభ్యంతరాల క్రమంలో 2015లో నిర్మాణం నిలిచిపోయింది. ఆ తర్వాత క్రమంలో ఆదిత్య బిర్లా సంస్థ ఈ పరిశ్రమను దక్కించుకుని నిర్మాణం పూర్తిచేసింది. త్వరలో అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తోంది.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







