తిరుపతి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021 : ఈనెల 17న తిరుపతిలో నిర్వహించతలపెట్టిన అమరావతి పరిరక్షణ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని సమితి నాయకులు ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్తో అమరావతి న్యాయస్థానం నుంచి తిరుపతి దేవస్థానం వరకు సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నామని లేఖలో ఎస్పీకి తెలియజేశారు. 17వ తేదీన పాదయాత్ర తిరుపతికి చేరుకుంటుందని, అదేరోజున తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతి మంజూరుచేసి సహకరించాలని సమితి ప్రఽధాన కార్యదర్శి తిరుపతిరావు అభ్యర్థించారు. శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా, కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ సభను నిర్వహించుకుంటామని హామీ ఇస్తూ అనుమతిని కోరారు. బహిరంగ సభకు సంబంధించిన పూర్తివివరాలు అందించాలని ఎస్పీ సమితి నాయకులను కోరారు. వారినుంచి సమాచారం అందిన తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోనున్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







