గంగవరం (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు నిర్మల హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏటిపల్లి ఆశ కార్యకర్త ముర్ల చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గంగవరంలో సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు సోమవారానికి ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు నిర్మల సందర్శించి ఆశ వర్కర్ల దీక్షకు సంఘీభావం తెలిపి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారి మృతి చెందింది నెల రోజులు కావస్తున్నా అధికారుల్లో చలనం లేకపోవడం శోచనీయం అన్నారు. డ్యూటీ పేరుతో ఆశ వర్కర్లను వైద్యులు, వైద్య సిబ్బంది వేధింపులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. వైద్యాధికారుల వేధింపుల వల్లే చిన్నారి తీవ్ర ఒత్తిడికి గురైందన్నారు. ఆమె కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్ల నాయకురాలు మార్తమ్మ, మంగయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







