కాకినాడ (రెడ్ బీ న్యూస్) 31 అక్టోబర్ 2021: కాకినాడ జవహర్లాల్నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతిగా ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూకేను ఆదర్శవంతమైన సాంకేతిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సహకారంతో విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రసాద రాజుకు రిజిసా్ట్రర్ ఎల్.సుమలత, ఓఎస్డీ రవీంద్రనాథ్, డైరెక్టర్లు ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు, వి.రవీంద్ర, ప్రిన్సిపాల్ బాలకృష్ణ, వర్శిటీ అనుబంధ కళాశాలల మేనేజ్మెంట్లు, అధ్యాపక, అధ్యాపకేతర, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అభినందనలు తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







