గంగవరం (రెడ్ బీ న్యూస్) 10. డిసెంబర్ 2021: బాలికల ఆరోగ్యం, ఆహారం విద్యా ప్రగతి విషయాల్లో ఉపాధ్యాయ సిబ్బంది తగిన శ్రద్ధ చూపాలని సహాయ గిరిజన సంక్షేమ అధికారిణి హాసిని, మండల విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను వారు వేర్వేరుగా శుక్రవారం సందర్శించి తనిఖీ చేశారు. వసతి గృహంలో వంటశాలలో వంట సామాగ్రి పరిశుభ్రత విషయంలో శ్రద్ధ చూపాలని సూచించారు. వసతి గృహం గదులను మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. వసతి గృహం పరిశుభ్రంగా ఉంచాలని ఆహార వంటకాలు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం రాత్రి సమయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి బాలికల విద్యా ప్రగతికి పురోగతికి కృషి చేయాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం విషయంలో వైద్య సేవలు అందించడంలో పాఠశాల ఏఎన్ఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. పాఠశాల ఆవరణలో న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, పాఠశాల పరిసరాల్లో మురుగునీరు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల ఇన్ ఛార్జ్ హెచ్ఎం పోతురాజు దొర, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







