గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021: గంగవరం మండలం లక్కొండ గ్రామములో ఇటీవల ఇల్లు దగ్ధమైన భాదితులు వెలుగుల హరిచంద్రారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏజెన్సీ డివిజన్ కార్యదర్శి డి. సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై శనివారం న తాహశీల్దార్ శ్రీమన్నారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కొండ గ్రామంలో పూరి ఇల్లు కాలిబూడిదై సుమారు రూ.మూడు లక్షల రూపాయలు నష్టం వాటిల్లి కుటుంబం మొత్తం కట్టుబట్టలతో రోడ్డున పడ్డారని, వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో తహశీల్దార్ శ్రీమన్నారాయణ ఆ కుంటుబానికి ముప్పై కేజిల బియ్యం అందచేశారు. నష్ట పరిహారం కూడా అందేలా కృషి చేస్తానని హామి ఇచ్చారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







