గంగవరం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: గంగవరం గ్రామశివారులో 193 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు. అడ్డతీగల నుంచి గంగవరం వైపు వచ్చే గంగవరం గ్రామ శివారులో ముందుగా వచ్చిన సమాచారంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ-31 ET 4911 ఇన్నోవా వాహనాన్ని పోలీసులను చూసి దూరంగా నిలిపివేసి అందులో వ్యక్తులు పరారయ్యారు. గంగవరం తహశీల్దార్ శ్రీమన్నారాయణ సమక్షంలో కారును తనిఖీ చేయగా 8 బస్తాల్లో 193 కిలోల గంజాయి లభించింది. దీని విలువ రూ. 3 లక్షల 86 వేలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. నిందితులకోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఏఎస్ఐ రజాక్, వీఆర్వో అప్పలకొండ పోలీస్ సిబ్బంది వీరబాబు, రమణ ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







