అన్నవరం (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: అన్నవరం సత్యదేవుడికి పంచామృతాభిషేకాలు జరుగుతుండగానే భక్తులు క్యూలైన్ల ద్వారా శనివారం వేకువనే స్వామిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సత్యదేవుని జన్మనక్షత్రం సందర్భంగా శనివారం తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాతం, 2 గంటలకు మహన్యాసం జరుగుతుంది. అనంతరం 3 గంటల నుంచి 4.30 వరకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్టుకు పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. సాధారణంగా అభిషేకం సమయంలో ప్రత్యేక టికెట్లు పొందిన వారికి మినహా సాధారణ భక్తులను అనుమతించరు. సత్యదీక్షల విరమణ, రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామున 3 నుంచి 4.30 గంటల వరకు స్వామికిఅభిషేకం జరుగుతుండగానే క్యూలైన్లలో(అంతరాలయం బయట నుంచి) భక్తులు దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వనదుర్గ అమ్మవారి ఆలయంలోచండీహోమం నిర్వహించారు. 3,333 వ్రతాలు జరిగాయి. రూ.33.56 లక్షల ఆదాయం సమకూరింది
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







