ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : మధ్యప్రదేశ్ లోని పెంచ్ టైగర్ రిజర్వ్ లో లెజెండరీ ఆడ పులి 'కొల్లారావాలి' మృతి పట్ల కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ స్పందించారు. 29 పులులకు జన్మనిచ్చిన ఈ 'పెంచ్ టైగర్ రిజర్వ్ క్వీన్' మరణం తీరని లోటుగా అభివర్ణించారు. సూపర్ మామ్ గా పిలవబడే 'కొల్లారావాలి' మన దేశంలో పులుల జనాభాను పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడంలో చేసిన మేలు ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ ఆయన ట్విట్ చేశారు. మరోవైపు, ఈ పులి మరణించిన విషయం తెలిసి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నివాళులర్పించారు. మధ్యప్రదేశ్ 'టైగర్ స్టేట్ హోదా సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ పులి తమ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ 'పెంచ్ టైగర్ రిజర్వ్ క్వీన్' పిల్లల గర్జనతో మధ్యప్రదేశ్ అడవులు ఎప్పుడూ ప్రతిధ్వనిస్తాయని పేర్కొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







