గంగవరం (రెడ్ బీ న్యూస్) 2 నవంబర్ 2021: ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న ఏపీ సీఎం కప్ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ఎంపీడీవో జాన్ మిల్టన్ ఎంఈఓ మల్లేశ్వరరావు కోరారు. స్థానిక ఎంఆర్సీలో క్రీడా పోటీల నిర్వహణపై వ్యాయామ ఉపాధ్యాయులు, డైరెక్టర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసులోపు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అని అన్నారు. పోటీలకు హాజరయ్యేవారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న క్రీడా ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఆధార్ కార్డ్, పదవ తరగతి మార్క్ లిస్ట్ జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు రంపచోడవరంలో నిర్వహించే డివిజన్ స్థాయి పోటీలకు అర్హులవుతారని, ఈ క్రీడా పోటీల్లో వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, జావెలిన్ త్రో, లాంగ్ జంప్ వంటి క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







