న్యూయార్క్ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంవేర్ 2021: భీకర ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకోవడం సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ అసాధారణ రీతిలో ఓ అక్క, తమ్ముడు అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలను కాపాడుకున్న ఘటన న్యూయార్క్లో జరిగింది. ఈస్ట్ విలేజ్ లోని జాకబ్ రియిస్ భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అన్ని వైపుల నుంచి మంటలు చుట్టుముట్టిన స్థితిలో అక్కాతమ్ముళ్లు ఆ భవనం కిటికీ ద్వారా బయటపడేందుకు యత్నించారు. ప్రమాదకర స్థితిలో కిటికీకి వెలాడుతూ.. పక్కనే ఉన్న పైపును పట్టుకున్నారు. క్షేమంగా కిందకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. సహాయం కోసం ఎదురుచూడకుండా.. చాకచక్యంగా బయటపడ్డ ఆ అక్కాతమ్ముళ్లను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వారు నిజమైన హీరోలంటూ కొనియాడుతున్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







