గంగవరం (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : రాష్ట్రంలో నిత్యం పెరిగిపోతున్న నిత్యావసర వస్తువులు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గంగవరంలో మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో జరిగిన ధరలు దిగిరావాలి జగన్ దిగిపోవాలి కార్యక్రమంలో ఆమె మంగళవారం పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతుంటే ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని, సినిమా టికెట్లు ధర తగ్గించడంలో ఉన్న శ్రద్ధ ప్రజల ఇబ్బందులపై లేదన్నారు. అనంతరం కూరగాయలు, గ్యాస్ సిలెండర్ తో గంగవరం వై జంక్షన్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు, మాజీ ఎంపీపీలు డాక్టర్ తీగల ప్రభ, శ్రీ రాములు, టీడీపీ నాయకులు కృష్ణ, వెంకట్ రెడ్డి, వెంకటరమణ, అప్పారావు, బద్రి, ప్రసాద్, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







