గంగవరం (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు బుధవారం మండల స్థాయి అధికారులు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. తాహశీల్దార్ శ్రీమన్నారాయణ గంగవరం ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను, వంటశాల, మరుగుదొడ్ల పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వేములోవ ఆశ్రమ ఉన్నత పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి మల్లేశ్వరరావు తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్.వి.వి సత్యనారాయణ, వసతి గృహా సంక్షేమ అధికారులు ఎం. శ్రీనివాసరావు, సీతారత్నం తదితరులు ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







