గంగవరం (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022: పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు పదవులు దక్కుతాయని ఎంపీపీ కృష్ణారెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, వైసీపీ మండల ఇన్చార్జి రఘునాథ్ అన్నారు. మంగళవారం గంగవరం ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి రెండవ వైస్ ఎంపీపీగా ఎంపిక కావడంతో ఆమెకు వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యే ధనలక్ష్మి సహకారంతో మండలం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామ తులసి, కో-ఆప్షన్ సభ్యులు కళ్లెం ప్రభాకర్, వైస్సార్సీపీ రైతు విభాగం కార్యదర్శి వైయస్ ప్రసాద్, ఎంపీటీసీలు మద్దిటి వెంకటలక్ష్మి, కోటికలపూడి రామతులసి, పద్మావతి, మండల నాయకులు బూరకట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







