పెద్దాపురం,31 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్):ఏఐటీయూసీ శత వార్షికోత్సవాలను స్థానిక వినాయకుడి గుడి సమీపంలో ఉన్న జుట్టు వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. జట్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు యాకా రామకృష్ణ ఆధ్వర్యంలో యూనియన్ సీనియర్ నాయకుడు ముమ్మన సత్యనారాయణ ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిన ఏఐటియుసి కార్మిక, కష్టజీవుల, అణగారిన వర్గాల సంక్షేమం, హక్కుల సాధన కోసం గత శతాబ్ద కాలంగా అవిశ్రాంత పోరాటం సాగిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను విడనాడి, కార్మికుల హక్కులను పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బోనం సోమేశ్వరరావు, బొట్టా త్రిమూర్తులు, బొడ్డు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







