ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబరు 2021: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. వేకువజామునే స్వామివారి తీర్ధపు బిందెతో గోదావరి జలాలను తీసుకువచ్చి అభిషేకించారు. పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై దివ్యప్రబంధం పారాయణం నిర్వహించారు. ఉభయ రాష్ట్రాలనుంచి వేలాదిమంది భక్తులు గోవిందనామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మాఢవీధులలో స్వామివారికి ఏడు ప్రదక్షిణలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుని స్వామివారికి తలనీలాలు, కానుకలు సమర్పించారు. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.7,59,018 లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







