అధిక ధరలకు విక్రయాలపై ఆర్డీవోకు ఫిర్యాదు
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) పట్టణంలో కూరగాయలను వ్యాపారులు అధిక ధరలకు
విక్రయిస్తున్నారని ఆర్డీవో మల్లిబాబుకు సామాజిక కార్యకర్త గుణ్ణం లక్ష్మణరావు
బుధవారం ఫిర్యాదు చేశారు. అలాగే పట్టణంలో రైతు బజార్ లో కూరగాయాలు
కొనుగోలు చేసుకునేందుకు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారని, దీంతో సామా
న్యులు కూరగాయలు కొనుగోలు చేయాలంటే బహిరంగ మార్కెట్లో అధిక ధర
లను వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. కనీసం పాదచారులు వెళ్లేం
దుకు కూడా మార్గం లేకుండా మూసివేశారని ఆయన ఆర్డీవో వివరించారు. రైతుబజార్ ఉన్నా నిర్వీర్యమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధిక ధరల
విక్రయాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే రైతుబజార్కు వెళ్లే మార్గంలో అడ్డంకులను తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







