పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: స్థానిక మరిడమ్మ దేవస్థానంలో అత్యంత వైభవంగా లక్ష్మీ గణపతి హోమం, గోపూజా కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గోమాతను ఆలయం చుట్టూ ప్రదక్షిణ గావించి, అనంతరం అమ్మవారి సన్నిధిలో గోమాతను ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రజలకు సర్వ శుభాలు కలగాలని లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రసాదాలను వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







