పెద్దాపురం, సెప్టెంబరు 13: తూర్పుగోదావరి జిల్లా
పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు వ్యవసాయ కూలీలు ఆదివారం దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన వాడ్రేవు బాబురావు (50), కోలా వెంకట రమణ (45) అనే ఇద్దరు వ్యవసాయ కూలీలు కాండ్రకోట నుంచి జె. తిమ్మాపురం వెళ్లే రహదారిలో కుర్రా రాంబాబుకు చెందిన పంట పొలంలో వరి కలుపుతీత పని చేస్తుండగా అకస్మాత్తుగా భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అక్కడే పని చేసుకుంటున్న వీరు పిడుగుపాటుకు గురయ్యారు. ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







