గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: ఉద్యోగుల పట్ల వారి సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర ఉద్యోగుల సంఘాలు పిలుపుమేరకు మంగళవారం మండలంలోని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వర్తించారు. రాష్ట్ర ఉద్యోగుల సంఘం రంపచోడవరం డివిజన్ ప్రధాన కార్యదర్శి జిలాని ఆధ్వర్యంలో రెవిన్యూ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రకృతి వైపరీత్యాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డీఏ బకాయిలతో పాటు పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీమన్నారాయణ, డిప్యూటీ తహశీల్దార్ రామకృష్ణ, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







