గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: పీడిత జనవిముక్తి కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బాదంపూడి బాబూరావు అన్నారు. బయ్యనపల్లిలో రైతుకూలీలతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి, భుక్తికోసం ఈ దేశ విముక్తి కోసం కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి మొదలుకొని సుమారు అయిదు వేల మంది కామ్రేడ్స్ అమరత్వం పోందారని, ముఖ్యంగా నవంబరులో ముఖ్యనాయకులు అమరులైయ్యారన్నారు. అందుకే ఈ నెలంతా గ్రామ గ్రామాన అమరులను స్మరించుకుంటూ సభలు సమావేశాలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ నెల పదకొండవ తేదిన గంగవరంలో సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి డి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







