కాట్రేనికోన (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: తమ సొంత భూమి(పార్వతిదేవి, ఆమె తల్లి నాగరత్నంకు.. సర్వే నంబరు 424/2లో 50 సెంట్లు చొప్పున)కి సంబంధించి రెవెన్యూ అధికారులు వేరొకరికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చి అన్యాయం చేశారని కాట్రేనికోన మండలం కందికుప్పకు చెందిన మహిళారైతు గోనెమడతల పార్వతీదేవి ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించి తహసీల్దారుపై కేసు నమోదు చేసింది. ఈ నెల 27న కేసు విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. తనకు అందిన లేఖను చూపిస్తూ ఆదివారం విలేకర్లతో ఆమె మాట్లాడారు. దీనిపై తహసీల్దారు, జిల్లా కలెక్టరుకు ‘స్పందన’లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అక్టోబరులో లోకాయుక్తను ఆశ్రయించానన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







