పెద్దాపురం:31 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్):
ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటరు ఓటు నమోదుపై స్పందించాలని ఆర్డీవో యస్. మల్లిబాబు తెలిపారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం హాలులో జాబితా సవరణ, ఓటర్లును చైతన్య పరచడం, భాగస్వామ్యం చేయడం కోసం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెద్దాపురం తహశీల్ధార్ బూసి శ్రీదేవి అధ్యక్షతన ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. మెప్మా, డ్వాక్రా యానిమేటర్స్ తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్డీవో మల్లిబాబు మాట్లాడారు. ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును కలిగి ఉండాలనే దృక్పథంతో ఎన్నికల కమిషన్ స్వచ్ఛమైన ఓటరు జాబితాను రూపొందించడానికి ప్రజలను చైతన్య పరచడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఓటే వజ్రాయుధమని అన్నారు. చాలామంది ఓటు నమోదు, మార్పులు, ఓటు బదిలీలు, తదితర అంశాలపై అవగాహన లేక ఓటు హక్కును కోల్పోతున్నారని అన్నారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం-6, శాసనసభ నియోజకవర్గం నుంచి వేరే శాసనసభ నియోజకవర్గానికి మార్చుకోవడానికి ఫారం-7, ఓటరు జాబితాలో పేరు తొలగింపు కోసం ఫారం-8, ఓటర్ల జాబితాలో ఎంట్రీలలో మార్పులు ఫారం-8ఏ, తదితర అంశాలపై పూర్తి సమాచారపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జె. సురేంద్ర, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, మెప్మా కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి, యానిమేటర్స్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







