హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి కేసులో పోలీస్ కస్టడీ ముగిసింది. మూడ్రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణ సందర్భంగా శిల్పా చౌదరి నుంచి నార్సింగ్ పోలీసులు పలు వివరాలు సేకరించారు. ఆమె ఖాతాలో రూ.16వేలు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ.14వేలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శిల్ప ఇప్పటి వరకు రూ.కోట్లలో మోసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 3 కేసుల్లో రూ.7కోట్లు మోసం చేసినట్టు ఆమెపై బాధితులు ఫిర్యాదు చేశారు. ముగ్గురికీ రూ.7కోట్లు తిరిగిచ్చేస్తానని శిల్పాచౌదరి పోలీసులకు చెప్పినట్టు సమాచారం. దివ్యారెడ్డి, ప్రియదర్శిని, రేణుకారెడ్డిల నుంచి శిల్ప రూ.7కోట్లకు పైగా తీసుకొని ఎగవేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. శిల్ప అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అమెరికా నుంచి భారత్కు వచ్చి మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. రాధికారెడ్డికి రూ.10కోట్లకు పైగా ఇచ్చినట్టు శిల్ప చెప్పినప్పటికీ తగిన ఆధారాలు ఇవ్వలేదు. ఆమె మోసాలపై నార్సింగ్ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







