గంగవరం,3 మే 2020(రెడ్ బీ న్యూస్): అడ్డతీగల భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో లోతట్టు గిరిజన గ్రామాలైన తీటుకురాళ్ళు, పి.గంగవరం గ్రామాల్లో గిరిజన కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, అరటి పండ్లు, మాస్కులు, దుస్తులను ఆదివారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సేవకులు గిరిజనులకు ఆరోగ్య సూత్రాలు వివరించారు. ఈవ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, మాస్కులు ధరించాలని అలాగే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని సూచించారు. సబ్బుతో చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని సూచించారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







