గంగవరం (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుబంధంగా విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగికి శుక్రవారం కొవిడ్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో గంగవరంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవల మండలంలో కొవిడ్ కేసులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న ప్రజలకు మళ్లీ కోవిడ్ కేసు రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తాహశీల్దార్ శ్రీమన్నారాయణ కోరారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవలన్నారు. త్వరలోనే కివిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







