అమరావతి (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలకు ఈనెల 30 వరకూ సెలవులు పొడిగించడంతో.. ఏపీలో పాఠశాలలకు సెలవులు పొడిగింపుపై విద్యాశాఖలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై సోమవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో కరోనా పాజిటివ్ రేట్ ఇప్పటికే 13.87 శాతానికి చేరడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయని వైద్యులు చెపుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్ధుల ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. వారికి ఇంకా వ్యాక్సినేషన్ పూర్తికానందున పాఠశాలలు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు తర్జన బర్జన పడుతున్నారు. ఒకవేళ పాఠశాలలు కొనసాగిస్తే ఎక్కడైనా కేసులు వెలుగు చూస్తే ఏం చేయాలనే దానిపై కూడా చర్చలు జరుపుతున్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







