గంగవరం (రెడ్ బీ న్యూస్) 9 నవంబర్ 2021: గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ బాలికోన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, లూధరన్ ఎయిడెడ్ పాఠశాలల్లో మండల విద్యాశాఖాధికారి వై.మల్లేశ్వరరావు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తరగతి గదిలో పాఠాలు చెప్పే తీరును పరిశీలించారు. విద్యార్థుల్లోని విద్యా ప్రమాణాల స్థాయి పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సిద్ధం చేసిన వంటలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ సక్రమంగా అమలు చేయాలని, పాఠశాలలు పరిసరాలు, వంట షెడ్డు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అప్పారావు, రమణ, రాంబాబు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







