సామర్లకోట, 23 ఏప్రిల్ 2020 ( రెడ్ బీ న్యూస్):సామర్లకోట కోలావారి వీధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. దీంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హుటాహుటిన అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.అలాగే మునిసిపల్, పోలీసు అధికారులు పరిసర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. భాదితుడు మర్కజ్ వెళ్లొచ్చిన నేపథ్యంలో గత నెల 24 వ తేదీన నిర్వహించిన కరోన పరీక్షలలో నెగిటివ్ వచ్చింది. దీంతో హోమ్ క్వారంటైన్ ఉండాలని అధికారులు సూచించారు.తిరిగి ఈనెల 22న కరోన టెస్టు చేయగా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ సెంటర్ కు అధికారులు తరలించారు. ఇదిలా ఉండగా పాజిటివ్ పేషెంట్ కు కాంటాక్ట్ లో ఉన్న 16 మందిని క్వారంటైన్కు తరలించి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.
అలాగే బాధితుడి ఇంటి నుంచి 500 మీటర్లు పరిధిని రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







