గంగవరం,1 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం లభిస్తుందని ఎంపీడీవో జాన్ మిల్టన్ అన్నారు. గంగవరంలో మనం - మన పరిశుభ్రత కార్యక్రమాన్ని సచివాలయం ఆవరణలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఇంటిని, అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పారిశుధ్య లోపం కారణంగా అనేక అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని, అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన కోరారు. మండలంలో గంగవరం, నెల్లిపూడి రెండు గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. తొలిసారిగా ఈ రెండు పంచాయతీల్లో మనం - మన పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. పరిశుభ్రత కోసం ప్రతి ఇంటి యజమాని రోజుకు రూ.రెండు వంతున పంచాయితీకి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మనం - మన పరిశుభ్రత కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే వై.జంక్షన్ లో ర్యాలీ నిర్వహించి ఇంటింటా పర్యటించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఉపాధి ఏపీవో సురేష్ కుమార్, వెలుగు ఏపీఎం సత్య ప్రసాద్, మాజీ సర్పంచ్ అక్కమ్మ, పంచాయతీ కార్యదర్శి శాంతి, గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామ వలంటీర్లు, ఉపాధిహామీ, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







