కాకినాడ (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: పలువురు తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇస్తూ.. బదిలీలు చేస్తూ కలెక్టర్ హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ గ్రామీణ ఉప తహసీల్దారు మురార్జీని ఉద్యోగోన్నతిపై అక్కడే తహసీల్దారుగా నియమించారు. సెజ్ ఉప తహసీల్దారు ఎల్.ఝాన్సీలక్ష్మీని రౌతులపూడికి, జిల్లా పౌరసరఫరాల సంస్థ ఉప తహసీల్దారు పి.త్రినాథరావును అయినవిల్లి తహసీల్దారుగా నియమించారు. కె.గంగవరం తహసీల్దారుప్రసాద్ను తాళ్లరేవుకు, నిరీక్షణలో ఉన్న పి.చిన్నారావును కపిలేశ్వరపురానికి, అమరావతి నుంచి వచ్చిన వీవీ సత్యనారాయణను రావులపాలేనికి,తొండంగి ఉప తహసీల్దారు కె.కీర్తికి అక్కడే తహసీల్దారు బాధ్యతలు అప్పగించారు. మామిడికుదురు తహసీల్దారు ఎం.సుజాతను కడియానికి..అక్కడ తహసీల్దారు భీమారావును ఎటపాక ఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







