గంగవరం (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021 : రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనే అమలు జరుగుతోందని టీడీపీ నాయకులు విమర్శించారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహం వద్ద సమర్పించారు. అనంతరం కొత్తాడ, సూరంపాలెం పంచాయతీల్లో గౌరవ సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, ఓటిఎస్ బలవంతపు వసూళ్లు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున, ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, ఆముదాల బంద ఎంపీటీసీ సభ్యుడు కృష్ణ శ్యామ్, శ్రీను గోపాలకృష్ణ, వీరబాబు, చిన్న వెంకటరమణ, సింహాద్రి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







